టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఆమోదం విషయంలో సస్పెన్స్ నెలకొని ఉండడంతో రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం. టీఎస్ ఆర్టీసీ బిల్లును ఎలాగైనా పాస్ చేయాలని చూస్తున్న సర్కార్.. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ముందుగా మూడు రోజులే అసెంబ్లీ జరపాలని నిర్ణయించుకున్నా.. ఈ బిల్లు ఆమోదించడం కోసమే మరో రోజు కూడా సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ ఎన్నికలు.. ఎందుకంటే సీతాకాల అసెంబ్లీ సమావేశాలు వచ్చే లోపే తెలంగాణలో ఎన్నికలు జరిగిపోతాయి.. అప్పటికే కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరడం ఖాయం.. అందుకే ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించాలని సర్కార్ కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతుంది.
పూర్తిగా చదవండి..బిగ్ బ్రేకింగ్.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్
Translate this News: