CPI (Maoist) : సీపీఐ మావోయిస్టు పార్టీలో ప్రక్షాళన...రంగంలోకి అగ్రనేత గణపతి

వరుస ఎన్‌కౌంటర్‌లతో సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దండకారణ్యంలో నిర్భంధం అధికమవ్వడంతో పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావ్ అలియాస్ గణపతి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.

New Update
maoist in karnataka

maoist party

వరుస ఎన్‌కౌంటర్‌లతో సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఛత్తీస్‌గఢ్‌, కర్రెగుట్టలు, నేషనల్‌ పార్క్‌ ఇలా ప్రతిచోట మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భద్రతాదళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో అనేకమంది అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. మృతుల్లో అగ్రనేతలు నంబాల, చలపతి, ప్రయాగ్ మాంఝీ, సుధాకర్, గాజర్ల రవి తదితరులో పాటు పలువురు ఉన్నారు. దీంతో భద్రతాబలగాలతో పోరాడలేని స్థితిలో పీఎల్జీఏ దళాలు ఉన్నాయి. దండకారణ్యంలో నిర్భంధం అధికమవ్వడంతో పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. మావోయిస్టులు ప్రతిపాదించిన కాల్పుల విరమణకు సైతం ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

గడచిన ఏడాదిన్నరలో 550 మంది మావోల మృతిచెందడంతో పార్టీ బలహీన పడింది. దండకారణ్యంలో కేంద్రకమిటీ సమావేశానికి అనుకూలత లేకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నూతన వ్యక్తికి బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదు. దీంతో పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావ్ అలియాస్ గణపతి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవైపు అనారోగ్యం మరోవైపు వయోభారం వెంటాడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో గణపతికి బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read :  76,842 రేషన్‌ కార్డ్స్‌ ఔట్‌

CPI Maoist Party

 ప్రస్తుత నిర్భందాన్ని ఎదుర్కోవడంపై సిద్ధాంత రూపకర్త మావోజెడాంగ్ అనుసరించిన వ్యూహాలను గణపతి నిశితంగా గమనిస్తున్నారు. దండకారణ్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ దళాలు ఇప్పటికే చెల్లా చెదురయ్యాయి. మావోయిస్టుల హ్యూమన్ నెట్‌వర్క్ ను భధ్రతాబలగాలు దెబ్బతీయడంతో ప్లాటూన్ల మధ్య సమాచార మార్పిడికి తీవ్ర అవరోధం ఏర్పడుతోంది.భధ్రతాబలగాల సమర్థతను ముందస్తుగా అంచనావేయడంలోనూ అందుకనుగుణంగా గెరిళ్లా దళాలను సంసిద్ధం చేయడంలోనూ విఫలమయ్యామన్న భావనలో పార్టీ అగ్రనాయకత్వం ఉంది. విప్లవోద్యమాన్ని బ్రతికించుకునేందుకు సరికొత్త ఎత్తుగడను అనుచరించేందుకు సిద్ధమవుతోంది.

Also Read :  కేంద్రమంత్రి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ నిరాకరణ!

అండర్ గ్రౌండ్ క్యాడర్ ను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేయాలనే ఆలోచనలో మావోయిస్టు పార్టీ ఉంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ మరిన్ని ఏర్పాటు చేసి ఉత్తర భారత్ కేంద్రంగా భారత ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం చేయాలనే యోచనలో పార్టీ నాయత్వం ఉంది. ఆదరణ స్వల్పంగా ఉన్న నార్త్ రీజనల్ బ్యూరో ప్రాంతంలోనే విప్లవభావాజాలం కలిగిన విద్యార్థి సంఘాలను నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తోంది. నిర్భంధం అధికంగా ఉన్న కారణంగా విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలని సైద్దాంతిక భావజాలాన్ని పీడిత వర్గాలకు అందించాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తుంది. అడవులను వీడి అర్బన్ ఏరియాలే కేంద్రంగా వర్గపోరాట నినాదం ముందుకు సాగాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యాధునిక ఆయుధ సంపత్తితో అధునాతన సాయుధ సైన్యాన్ని నిర్మించుకోవాలని బహుముఖ వ్యూహం పన్నుతుంది. కొద్దికాలం మిడిల్ ఇండియా, సౌత్ ఇండియా లో పార్టీ కార్యకలాపాలను తగ్గించి నార్త్ ఈస్ట్ రీజనల్ బ్యూరోను బలోపేతం చేయాలన్న యోచనలో గణపతి ఉన్నట్లు సమాచారం.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

Also Read :  ఇరాన్‌పై అమెరికా సైనిక దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తున్నాం

 

muppala | chhattisgarh maoist | chhasttisgarh maoist news | Anti-Maoist Operation | Chhattisgarh Maoists | Encounter On Maoist | india maoism

Advertisment
Advertisment
తాజా కథనాలు