కార్మికులు రాజ్భవన్ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది?
టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాతే బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తమిళిసై(tamilisai) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు అడిగారు. వాటికి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెబితే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసన ఇవాళ(ఆగస్టు 5) రాజ్భవన్ని ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.