సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వర్షాలు, పకృతి వైపరిత్యాలు మన చేతిలో లేనప్పటికీ వాటిని ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రైతాంగం తీవ్ర నష్టాన్నిచవి చూసిందని, వర్షాల వల్ల జరిగిన నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 2014 తర్వాత రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు కేసీఆర్ సాంకేతికతతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ కేసీఆరే అన్న భట్టి.. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి మూడు చెక్ డ్యామ్లకు ప్లాన్ గీశారని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..కాళేశ్వరం ఇంజనీర్ కేసీఆరే.. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి చెక్ డ్యాంలకు ప్లాన్ గీశారు: భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు వరదల వల్ల సర్వం కోల్పోయి నడి రోడ్డున పడితే.. కేసీఆర్ మాత్రం వారి మంత్రులతో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేయించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
Translate this News: