TSRTC Chalo Raj Bhavan: టీఎస్ఆర్టీసీ (TS RTC) కార్మికులు చెప్పిందే చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును గవర్నర్ తమిళిసై (Tamilisai) ఇప్పటివరకు ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. ముందుగానే చెప్పినట్టుగా రాజ్భవన్ (Raj Bhavan) వైపు అడుగులేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులు నడపడం బంద్ చేస్తామని చెప్పిన ఆర్టీసీ కార్మికులు.. ఆ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో బంద్ని కొనసాగిస్తుండగా.. మరోవైపు చలో రాజ్భవన్కి (Chalo Raj Bhavan) ర్యాలీగా బయలు దేరారు. రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. నగరంలోని వివిధ డిపోల నుంచి భారీగా తరలివస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. విలీన బిల్లు విషయంలో గవర్నర్ సందేహాలపై కార్మికుల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికుల చలో రాజ్భవన్.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..!
చలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆ దశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు కార్మికులు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.
Translate this News: