కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ విజయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా బీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలు, పోరాటాలతో అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చామని అందుకే నేడు కేసీఆర్ దిగివచ్చి రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. తాము గతంలో సీఎస్ను కలిసి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశామని, లేకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినట్లు గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.
పూర్తిగా చదవండి..రైతు రుణమాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ వారిని పట్టించుకోరా..
Translate this News: