Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో వ్యక్తిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన చోటుచేసుకుంది.