AP BREAKING: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు రూ.66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామని తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించబోతున్నారు.
మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అన్నారు. చలపతి, చంద్రహాస్ను చంపినంత మాత్రానా ఈ నేలపై నక్సలిజం చావదన్నారు. తలలకు వెలకట్టి, తూట్లు పోడవడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు.
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని నియమించింది. ఆర్పీ సిసోదియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సంక్రాంతి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది.పండుగ రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక చివరి రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.
ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.