Andhra Pradesh: జనసేన లోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్తో చర్చించారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా.. అందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.