మరోసారి హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. ఎందుకోసమంటే..
ఇసుక స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు అధికారులు.