అనంతపురంలో.. దొంగల బీభత్సం | Thieves arrested in Anantapur | RTV
అనంతపురం జిల్లా బొందలదిన్నెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రతాప్ రెడ్డి, ప్రమీల, వెంకటలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గంధారగుట్టపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు. దీంతో టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేత కందిగోపుల మురళికి చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు.
అనంతపురం జిల్లా బొంతలపల్లి గ్రామస్తులు సెల్ఫోన్ సిగ్నల్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సత్యసాయి జిల్లా వీరప్పగారి పల్లిలో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని మనస్థాపం చెంది సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా కుర్లపల్లి గ్రామంలో శ్మశాన వాటికను కొందరు కబ్జా చేసి పంటలు సాగు చేస్తున్నారు. ఎవరైనా మృతిచెందితే పూడ్చిన చోటే పూడాల్చిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోయారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 50 రోజుల తర్వాత తాడిపత్రిలో కనిపించారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి రాకతో పోలీసులు టెన్షన్ పడ్డారు. కాగా కండిషన్ బెయిల్కు సంబంధించి సంతకాలు చేయడానికి తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు ఆయన చెప్పారు.