టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలి
ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్ ఇవాళ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లలో ఆమ్రపాలికి వైజాగ్ మున్సిపాలిటీ కమిషనర్గా నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇలంబర్తి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్ శాఖ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియాను కేటాయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీకి వెళ్లేందుకు ఆమ్రపాలితో పాటు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న మరో ఐదుగురు IAS అధికారులు ఆసక్తి చూపడం లేదు. DOPT ఆదేశాలపై కోర్టుకు కూడా వెళ్లారు. ఏపీకి వెళ్లడానికి వీరు ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చూడండి.
హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆమ్రాపాలి స్థానంలో మరొకరు రానున్నట్లు తెలుస్తోంది.
DOPT ఉత్తర్వులను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మరో నలుగురు IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముందు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తీర్పును రిజర్వ్ చేసింది.
ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు క్యాట్ షాక్ ఇచ్చింది. డీవోపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ తీర్పు వెల్లడించింది. రేపు యథావిధిగా ఎక్కడివాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు సేవ చేయాలని లేదా? అంటూ చివాట్లు పెట్టింది.