Amit Shah : తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులు!
అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం గాంధీ భవన్ కు చుట్టుకుంది. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు గాంధీభవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.