CM Revanth Reddy: తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాల్లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జమ్మికుంటలో జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది వృథా అవుతుందని అన్నారు. కారు మెకానిక్ షెడ్ కు పోయిందని.. దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని చురకలు అంటించారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని అన్నారు సీఎం రేవంత్. అందుకే గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులను పంపి, నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులని కాదు.. సరిహద్దులో సైనికులను తెచ్చుకున్నా నేను భయపడను అని అన్నారు.
Translate this News: