Accident: లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి..!
ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
వయనాడ్ ప్రకృతి వైపరిత్యం జరిగిన ప్రాంతానికి వెళుతుండగా కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కారుకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. మరోవైపు వయనాడ్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సంఖ్య 254 కు చేరుకుంది.
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి.
ముంబయ్ తీరంలో నిలిపిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో నావికుడు కూడా గల్లంతయ్యారు.
పూణేలోని రోడ్డుపై తన పిల్లలతో కలిసి బైక్పై వెళ్తున్న ఓ మహిళ.. ఓవర్టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని కారులో వెనకాలే వస్తున్న మరో వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో పోలీసులు నిందితుడితో పాటు అతనితో ఉన్న మరో మహిళను అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉంది.
కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బీవీసీ కాలేజీ బస్సు బోల్తా పడింది. స్టీరింగ్ ఫెయిల్ కావడంతో బస్సు పల్టీలు కొట్టడంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన ఉప్పలగుప్తం సరిపల్లి వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు.
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది.శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఉన్న కుటుంబం మొత్తం బలైపోయింది. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణీ కూడా మృతి చెందింది.