ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు దుర్మరణం!

ఛత్తీస్‌గఢ్ రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు. 

author-image
By srinivas
New Update
accident

Accident: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధా బాగీచా ప్రధాన రహదారిపై అతివేగంగా వెళ్తున్న స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు.

ఓ బాలిక, ఓ మహిళ సహా ఆరుగురు..

కుస్మి నుంచి సూరజ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక, ఓ మహిళ సహా ఆరుగురు పురుషులున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ తోపాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఇరువురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు