/rtv/media/media_files/2024/11/18/N32D7SjOBvnkwhBxHVVd.jpg)
ఏపీలోని అనంతపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె గ్రామానికి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆటో, బస్సు ఢీకొన్నాయి. వ్యవసాయి కూలీలతో వెళ్తున్న ఆటోను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు ఆటో ప్రయాణికులు మరణించిన ఘటన తీవ్ర విచారాన్ని కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని… pic.twitter.com/S0qrFBJFrp
— Duddakunta Venkateswara Reddy/వెంకటేశ్వర రెడ్డి (@DuddakuntaBJP) November 23, 2024
ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?
పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా..
కుట్లూరు మండలంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నెలో పని కోసం ఆటోలో వెళ్లారు. తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!
ఇదిలా ఉండగా.. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో ఓ యువతిని సొంత కుటుంబ సభ్యులే నడిరోడ్డుపై కిడ్నాప్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందున ఆమెను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూర్చున్న ఆ యువతని నడిరోడ్డుపై కొట్టి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఆ యువతిని రక్షించారు.
ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?