MI VS GT:  క్వాలిఫయర్స్ 2 కు ముంబయ్..గుజరాత్ ఇంటికి..

ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 20 ఓవర్లలో హార్దిక్ సేన 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా..గుజరాత్ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

MI VS GT

ముంబై ఇచ్చిన భారీ లక్ష్యానికి గుజరాత్ కుదేలయిపోయింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌ లతో 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయ్ ఇచ్చిన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కమిందు మెండిస్ (20), రూథర్‌ఫోర్డ్ (24), షారుక్ ఖాన్ (13) పరుగులు చేశారు. చివర్లో ముంబయి బౌలర్లు పుంజుకొని పరుగులు కట్టడి చేయడంతో స్కోరు వేగం తగ్గి గుజరాత్ ఓటమి చవిచూసింది. ఎమ్ఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, బుమ్రా, గ్లిసన్, శాంటర్న్ , అశ్వనీ కుమార్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో క్వాలిఫయర్ 2 కు వెళ్ళిన ముంబయ్ ఇండయన్స్ ఆదివారం పంజాబ్ తో తలపడుతుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇప్పటికే ఫైనల్ కు వెళ్ళిన పోయిన ఆర్సీబీతో మ్యాచ్ ఆడతారు. 

రెచ్చిపోయిన రోహిత్ శర్మ..

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌ స్టో (47), సూర్య (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టాడు. మరోవైపు రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్‌లో మొత్తం 7 వేల పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. 

 

Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

Advertisment
Advertisment
తాజా కథనాలు