RCB VS DC: ఢిల్లీ విజయయాత్ర..వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.ఇందులో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలచింది. ఢిల్లీకిది వరుసగా నాలుగో విజయం. ఆర్సీబీ 163 పరుగుల లక్ష్యాన్నివ్వగా...దాన్ని డీసీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

New Update
ipl

RCB VS DC

ఢిల్లీ క్యాపిటల్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో పంజాబ్, లక్నోలతో పోటీ పడుతోంది. ఈరోజు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మీద ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 163 పరుగుల లక్ష్యాన్నివ్వగా...దాన్ని డీసీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  కే ఎల్ రాహుల్ విజృంభించి ఆడేశాడు. ఒంటి చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ లతో 93 పరుగులు దంచికొట్టాడు. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించారు. అలాగే మరో బ్యాటర్ స్టబ్స్ కూడా 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ మొదట తొందరగానే నాలుగు వికెట్లను కోల్పోయింది. 12 ఓవర్ల వరకు కూడా నెమ్మదిగానే ఆడింది. ఒకదశలో 14 ఓవర్లకు కేవలం 99 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గెలుపు ఇరు జట్ల మధ్యనా ఊగిసలాడింది. కానీ తరువాత మూడు ఓవర్లలో కే ఎల్ రాహుల్, స్టబ్స్ బ్యాటింగ్ ఇరగ్గొట్టారు. మూడు ఓవర్లలో మొత్తం మ్యాచ్ ను మార్చేసి గెలుపును తమవైపుకు తిప్పేసుకున్నారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, యశ్‌ దయాల్‌, సుయాశ్‌ శర్మ ఒక్కో వికెట్‌ తీశారు. 

ఆర్సీబీ చెత్త బ్యాటింగ్..

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. మొదట ఇన్నింగ్‌లో RCB ఘోరంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మొదట మంచి ఫామ్ కనబరిచినా.. మధ్యలో వరుస వికెట్లు పడటంతో తక్కువ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లుగా దిగిన సాల్ట్, విరాట్ కోహ్లీ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. కానీ ఆ దూకుడు ఎక్కువ సమయం నిలవలేదు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్  17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు, విరాట్ కోహ్లీ  14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 పరుగులతో కాసేపు దూకుడుగా ఆడారు. రజత్ పటీదార్ 25, కృనాల్ పాండ్య 18 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్  20 బంతుల్లో 2 ఫోర్, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేయడంతో ఆర్సీబీ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, ముకేశ్‌ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

 today-latest-news-in-telugu | IPL 2025 | delhi 

Also Read: USA: పెంచుకుంటూ పోతోంది..చైనాపై మళ్ళీ టారీఫ్ ల పెంపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు