USA: పెంచుకుంటూ పోతోంది..చైనాపై మళ్ళీ టారీఫ్ ల పెంపు

 చైనా ఉత్పత్తులపై సుంకాలను అమెరికా మరోసారి పెంచేసింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ దేశంపై టారీఫ్ లను 145 శాతానికి పెంచినట్లు చెప్పింది.  ఫెంటనిల్ పై 20 శాతం టారీఫ్ లు అదనం అని చెప్పింది.

New Update
trump tax backstep

trump tax backstep

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. ఒకరి మీద ఒకరు సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా అమెరికా మరోసారి చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచేసింది. ఇంతకు ముందే 125 శాతానికి టారీఫ్ లను పెంచింది. ఇప్పుడు ఫెంటనిల్ పై 20 శాతం అధికం అని వైట్ హౌస్ తేల్చి చెప్పింది. దీంతో దీంతో చైనాపై సుంకాలు 145 శాతానికి చేరుకున్నాయని స్పష్టం చేసింది. 

చైనాకు మాత్రం లేదు..

పైగా 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుంకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీని తరువాత చైనా కూడా తమ సుంకాలను 125 శాతానికి పెంచేసింది. రెండు దేశాలూ మీరెంతంటే...మేమూ అంతే అంటూ మొంకు పట్టుదల పట్టుకుని కూర్చొన్నారు. 

 today-latest-news-in-telugu | usa | china | donald trump tariffs

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు