IPL 2025: మళ్లీ మళ్లీ అదే తప్పు.. కోల్కతా వైఫల్యంపై మోర్గాన్ షాకింగ్ కామెంట్స్!
కోల్కతా వరుస ఓటములపై మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈడెన్ గార్డెన్స్లో ఓటమి జీర్ణించుకోలేనన్నాడు.
IPL 2025: ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వరుస ఓటములపై మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశాడు. 8 మ్యాచుల్లో కేవలం 3 మాత్రమే గెలిచిన కోల్కతా.. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో తడబడటం దారుణం అన్నాడు.
‘అందరూ కోరుకున్నట్లు కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని బౌన్స్ బ్యాక్ కావట్లేదు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తోంది. బ్యాటింగ్ లైనప్లో మార్పులు చేశారు. కానీ అవి వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికైనా లోపాలను గుర్తించి విజయాలబాట పట్టాలి. సొంత గ్రౌండ్ ఈడెన్ గార్డెన్ లో ఓటములు ఇబ్బందిగానే ఉన్నాయి' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మ్యాచ్ ఓటమిపై స్పందించిన రహానే.. ‘గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలం అనుకున్నాం' అనే కామెంట్స్ పై మోర్గాన్ ఫైర్ అయ్యాడు. అజింక్య వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ పిచ్పై బాల్ అనుకున్నదానికంటే ఎత్తులో వచ్చింది. దీంతో బౌండరీలు కొట్టడం బ్యాటర్లకు కష్టంగా మారింది. ఈ ఇన్నింగ్స్లో భాగస్వామ్యాలు సరిగా లేవన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో 36 బంతుల్లో 52 పరుగులు చేసిన సాయి సుదర్శన్ పై టీమ్ఇండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. ‘సాయి బ్యాటింగ్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. క్లాసికల్ బ్యాటర్ పరుగులు చేశాడు. పేస్ను వాడుకొని, స్మార్ట్ క్రికెట్ ఆడుతున్నాడు'అంటూ పొగిడేశాడు.
IPL 2025: మళ్లీ మళ్లీ అదే తప్పు.. కోల్కతా వైఫల్యంపై మోర్గాన్ షాకింగ్ కామెంట్స్!
కోల్కతా వరుస ఓటములపై మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈడెన్ గార్డెన్స్లో ఓటమి జీర్ణించుకోలేనన్నాడు.
Eoin Morgan made shocking comments on Kolkata defeat
IPL 2025: ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వరుస ఓటములపై మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశాడు. 8 మ్యాచుల్లో కేవలం 3 మాత్రమే గెలిచిన కోల్కతా.. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో తడబడటం దారుణం అన్నాడు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు..
‘అందరూ కోరుకున్నట్లు కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని బౌన్స్ బ్యాక్ కావట్లేదు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తోంది. బ్యాటింగ్ లైనప్లో మార్పులు చేశారు. కానీ అవి వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికైనా లోపాలను గుర్తించి విజయాలబాట పట్టాలి. సొంత గ్రౌండ్ ఈడెన్ గార్డెన్ లో ఓటములు ఇబ్బందిగానే ఉన్నాయి' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మ్యాచ్ ఓటమిపై స్పందించిన రహానే.. ‘గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలం అనుకున్నాం' అనే కామెంట్స్ పై మోర్గాన్ ఫైర్ అయ్యాడు. అజింక్య వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ పిచ్పై బాల్ అనుకున్నదానికంటే ఎత్తులో వచ్చింది. దీంతో బౌండరీలు కొట్టడం బ్యాటర్లకు కష్టంగా మారింది. ఈ ఇన్నింగ్స్లో భాగస్వామ్యాలు సరిగా లేవన్నాడు.
Also Read: xAI గ్రోక్కి చాట్జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ఇక ఈ మ్యాచ్లో 36 బంతుల్లో 52 పరుగులు చేసిన సాయి సుదర్శన్ పై టీమ్ఇండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. ‘సాయి బ్యాటింగ్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. క్లాసికల్ బ్యాటర్ పరుగులు చేశాడు. పేస్ను వాడుకొని, స్మార్ట్ క్రికెట్ ఆడుతున్నాడు'అంటూ పొగిడేశాడు.
Also Read: 'కింగ్డమ్' నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
kkr | gujarath | telugu-news | today telugu news