/rtv/media/media_files/2025/06/29/eng-w-vs-ind-w-2025-06-29-13-16-25.jpg)
ENG W vs IND W
భారత్ vs ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. జూన్ 28న (శనివారం) నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి.. భారత జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు విజయంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. రికార్డు స్థాయిలో సెంచరీ సాధించింది.
Also Read: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
భారత్ ఘన విజయం
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు ఐదు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. స్మృతి మంధాన బ్యాట్తో చెలరేగిపోయింది. 62 బంతుల్లో 112 పరుగులు చేసింది. ఇందులో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అలాగే హర్లీన్ డియోల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ఆమె 23 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు సాధించింది. ఇక ఇంగ్లాండ్ జట్టులో లారెన్ బెల్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టింది.
Smriti Mandhana hit Century just 51 balls against England #ENGvIND #ENGWvsINDW #INDWvENGW pic.twitter.com/DHgfJuE6C9
— Info india (@IndEnfo) June 28, 2025
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ మహిళా జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్ను 14.5 ఓవర్లలో 113 పరుగులకు కుదించారు. కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ 42 బంతుల్లో 66 పరుగులు చేసింది. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. అలాగే టామీ బ్యూమాంట్ 10 పరుగులు, ఎం ఆర్లాట్ 12 పరుగులు మాత్రమే చేశారు. మిగతా వారు చేతులెత్తేయడంతో విజయం భారత్ సొంతమైంది.
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
స్మృతి రికార్డుల వర్షం
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో స్మృతి మంధాన సెంచరీతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాట్స్మన్గా స్మృతి మంధాన నిలిచింది. అలాగే మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన రెండవ భారతీయురాలుగా రికార్డుకెక్కింది.