Champions Trophy: ఫైనల్స్ రోజు వర్షం పడితే..రిజర్వ్ డే ఉంటుందా?

దుబాయ్ లో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరుగనుంది. భారత్, న్యూజిలాండ్స్ ఇందులో తలపడుతున్నాయి. ఒకవేళ ఆట జరిగే సమయానికి వర్షం పడితే..అప్పుడు పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా?

author-image
By Manogna alamuru
New Update
ind vs nz sunday

India Vs New Zeland Finals

మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోన్రమెంట్ లో ఇప్పటి వరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ కు చేరుకుంది. గ్రూప్ దశలో కూడా భారత్ న్యూజిలాండ్‌ను ఓడించింది. మరోవైపు, కివీస్ జట్టు భారతదేశం తప్ప మిగతా ప్రతి ఒక్కరినీ ఓడించింది. దీంతో ఇరు జట్లూ బలంగానే కనిపిస్తున్నాయి. ఐసిసి ఈవెంట్లలో భారత్‌పై న్యూజిలాండ్‌కు మంచి రికార్డు ఉంది, అందుకే టీం ఇండియా ఫైనల్‌లో ఎలాంటి తప్పు చేయకుండా ఆడాలని అనుకుంటోంది. 2000 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో టీమ్ ఇండియా కివీస్ చేతిలోనే ఓడిపోయింది. 2019లో వన్డే వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ భారత జట్టును సెమీ ఫైనల్స్ లో ఇంటికి పంపించింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో 25 ఏళ్ల స్కోరును పరిష్కరించుకునే సమయం ఆసన్నమైంది.

వర్షం పడితే...

ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతోంది. ఈరోజు వెదర్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది కానీ వర్షం పడే ఛాన్స్ లు చాలా తక్కువ ఉన్నాయి. కానీ అనుకోకుండా వాతావరణం మారి...వర్షం కనుక పడి, ఆట నిలిచిపోతే రిజర్వ్ డేను ఉపయోగిస్తారు. మ్యాచ్ మొదలయ్యాక ఇరు జట్లూ 25-25 ఓవర్లు ఆడేస్తే అప్పుడు స్కోర్ ను బట్టి, అంతకు ముందు గెలిచిన మ్యాచ్ ల రన్ రేట్ ను, పాయింట్ల పట్టిక బట్టి గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ మ్యాచ్ పూర్తికాకపోతే మాత్రం రేపు అంటే సోమవారం మళ్ళీ మ్యాచ్ ఆడతారు. ఆట పరిస్థితిని బట్టి వర్షం పడినా కూడా ఫైనల్స్ నిర్ణయించిన రోజే జరగాలి అంటే ఏదైనా అదనపు సమయాన్ని ఉపయోగించవచ్చేమో అంపైర్లు పరిశీలిస్తారు. లేకపోతే ఓవర్ల సంఖ్యను తగ్గిస్తారు. మాగ్జిమం అంపైర్లు రెండో రోజు మ్యాచ్ ను పోస్ట్ పోన్ చేసేకన్నా మొదటి రోజునూ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. 

Also Read: Champions Trophy: న్యూజిలాండ్ జట్టులో ఆ నలుగురే ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు