Ind vs Eng: బ్యాటింగ్ సూపర్ హిట్...బౌలింగ్ ఫట్

ముగ్గురు బ్యాటర్లు సెంచరీ చేశారు. 430 స్కోర్..అహా మన వాళ్ళు బ్రహ్మాండం అనుకున్నారు. అంతే అక్కడితో ఆట ఆగిపోయింది. అటు బ్యాటింగ్ లు వరుస వికెట్లు..ఇటు బౌలింగ్ లోనూ పరుగులు మీద పరుగులు. దీంతో భారత క్రికెటర్లు ఆడుతున్నారా లేదా అనే సందేహం మొదలైంది. 

New Update
second day

India vs England

ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మొదలైంది. మొదటి రోజే ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు ఇరగదీశారు. రెండో రోజు కాసేపు అదే కొనసాగింది. పంత్ సెంచరీ చేశాడు. అంతే అక్కడ ఆగిపోయింది భారత ఆటగాళ్ళ ఆట. మొత్తం ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో రెండో రోజు తిరుగులేని స్థితిలో నిలిచే గొప్ప అవకాశాన్ని టీమ్‌ఇండియా చేజార్చుకుంది. రెండో రోజు భారత బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 550-600 స్కోరు చేసేలా కనిపించిన భారత్‌.. 471 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 86 పరుగులకు 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. శుభ్ మన్ గిల్ 147 పరుగులు, పంత్ 178 బంతుల్లో 12×4, 6×6 లతో 134 పరుగులు చేశారు. 

Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

బుమ్రా తప్ప మిగతా అందరూ..

సరే బ్యాటింగ్ అనుకున్నంత కాకపోయినా మంచి స్కోరే సాధించారులే అనుకున్నారు. బౌలింగ్ కూడా బా చేస్తే అంతా బావుటుంది అనుకున్నారు. అలాగే ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ కూడా చాలా తొందరగా పడింది. అంతే ఆ తరువాత బౌలర్లు ఒక్క వికెట్ తీస్తే ఒట్టు. ఒక్క బుమ్రా తప్ప మిగతా వారందరూ తేలిపోయారు. స్పిన్నర్ జడేజా సైతం ప్రభావం చూపించలేకపోయాడు. బుమ్రా కష్టాన్ని ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఓలీ పోప్‌ (100 బ్యాటింగ్‌; 131 బంతుల్లో 13×4), బెన్‌ డకెట్‌ (62; 94 బంతుల్లో 9×4) కీలక భాగస్వామ్యంతో జట్టును మెరుగైన స్థితికి చేర్చారు. బుమ్రా ఒక్కడే 48 పరుగులకు 3 వికెట్లు తీశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 209 పరుగులు చేసి ఉంది. సిరాజ్‌ కొంచెం పర్వాలేదు కానీ.. ప్రసిద్ధ్, శార్దూల్, జడేజా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 

Also Read :  ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 310 మంది

ఇక రోహిత్, విరాట్ రిటైర్ అవ్వడంతో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ కు టెస్ట్ ఆడే అవకాశం వచ్చింది. సుదర్శన్ భారత జట్టులోకి రావడం ఇదే మొదటి సారి అయితే కరుణ నాయర్ కు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ పిలపు వచ్చింది. అయితే ఇద్దరూ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్లో ఇద్దరు నాలుగు బంతులు మాత్రమే ఆడి డకౌట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో అయినా ఇద్దరూ తమను తాము నిరూపించుకుంటారేమో చూడాలి. 

Also Read: BIG BREAKING: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం.. అన్నంత పని చేసిన ట్రంప్!

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

 

second-day | india-vs-england-test-match | today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు