/rtv/media/media_files/2025/02/20/pXQpX17rQaPsVr3x0KTK.jpg)
Subhman Gill
ఛాంపియన్స్ ట్రోపీలో భారత జట్టు శుభారంభం చేసింది. తమను తక్కవు అంచనా వేయొద్దు అని హెచ్చరించిన బంగ్లాదేశ్ కెప్టెన్ కు తమ ఆటతో సమాధానం చెప్పింది. దుబాయ్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 229 పరుగుల లక్ష్యాన్ని విధించింది. బరిలోకి దిగిన టీమిండియా 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయ సాధించింది. శుభ్ మన్ గిల్ సెంచరీతో మైమరిపించాడు.
ఫ్యూచర్ స్టార్..
టీమ్ ఇండియాలో ఆటగాళ్ళకు కొదవేమీ లేదు. ప్రతీ మ్యాచ్ లోనూ ఎవరో ఒకరు మెరుపులు మెరిపిస్తారు. కానీ నిలకడగా ఆడేవారు ఎవరైనా ఉన్నారా...ొత్తిడిలో కూడా జట్టు కోసం నిలబడే వారు ఎవరైనా ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. జట్టులో స్టార్ ఆటగాళ్ళు రోహిత్, విరాట్ కోహ్లీలు ఇప్పటి వరకు భారత జట్టును చాలాసార్లు విజయతీరాలకు చేర్చారు. కానీ వారిద్దరు ఇంకా ఎక్కువ రోజులు ఆడేలా లేదు. ఇప్పుడు కాకపోతే మరో ఏడాది, రెండేళ్ల తరువాత అయినా రిటైర్ అయిపోతారు. అప్పుడు జట్టు బాధ్యతను ఎవరు తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడున్న ఆటగాళ్ళల్లో చాలామంది టీ20 ఫార్మాట్ కు సెట్ అయినవారు. అందులో తమ సత్తా చూపిస్తారు కానీ వన్డేలు, టెస్ట్ ల్లో నిలబడలేదు. కానీ అసలు క్రికెట్ అంటే అవి రెండే కదా. వాటిల్లో ఎవరు నిలకడగా ఆడతారు అనే దానికి ఈ రోజు సమాధానం దొరికినట్టయింది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. అది కూడా బాగా ఒత్తిడి ఉన్న సమయంలో. మ్యాచ్ ఓపెనర్ గా దిగిన గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 10 ఓవర్లలోనే 69 పరుగులు అందించాడు. ఈ టైమ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గిల్ కు సహకారం అందించాడు. అయితే రోహిత్ అవుట్ అయ్యాక జట్టులో ఎవరూ నిలకడగా ఆడలేదు. వరుసగా వికెట్లు పోగొట్టుకుంటూ వచ్చారు. అయినా కూడా శుభ్ మన్ గిల్ ఎక్కడా తడబడలేదు. ఆరంభంలో దూకుడుగా ఆడిన గిల్..మిడిల్ ఓవర్లు వచ్చేసరికి పరిస్థితులకు తగ్గట్లు గేర్లు మార్చాడు. మిగతా ప్లేయర్లు వెనుతిరిగినా...ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా చివరి వరకూ కూల్ గా ఆడాడు. ఇప్పటికే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉన్న గిల్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు.