/rtv/media/media_files/2025/06/27/ind-vs-eng-test-series-2025-2025-06-27-09-12-46.jpg)
ind vs eng test series 2025
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే లీడ్స్లో జరిగిన మొదటి టెస్ట్లో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. మిస్ ఫీల్డ్, నిరాశ పరిచే బౌలింగ్ కారణంగా భారత్ ఓడిపోయింది. ఇప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఎడ్జ్బాస్టన్లో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది.
Also Read : రాజ్తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు
జస్ప్రీత్ బుమ్రా దూరం
ఈ సెకండ్ మ్యాచ్కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. పని భారం కారణంగా ఇంగ్లాండ్తో జరిగే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అతడు ఆడటం లేదని సమాచారం. ఈ సిరీస్లోని మొదటి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు.
దీని అనంతరం ఇప్పుడు ఎడ్జ్బాస్టన్లో జరగనున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ప్లేయింగ్ 11లో భాగం కావడం లేదని తెలుస్తోంది. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్కు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. సెకండ్ టెస్ట్ మ్యాచ్కు దూరం అయి.. మూడో టెస్ట్లో ఆడబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : సింగిల్ ఛార్జింగ్.. 500 కి.మీ మైలేజ్తో 2 కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
బుమ్రా స్థానంలో ఎవరు?
బుమ్రా ఒకవేళ రెండో టెస్ట్ మ్యాచ్కు ఆడకపోతే.. అతడి స్థానంలో ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యం బుమ్రా స్థానంలో ఇద్దరిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ష్ దీప్ సింగ్ లేదా ఆకాష్ దీప్ను బుమ్రా స్థానంలో తీసుకురానున్నట్లు సమాచారం. అర్ష్ దీప్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆకాష్ దీప్ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. అతడు మొత్తం 12 ఇన్నింగ్స్లలో 15 వికెట్లు తీశాడు. అయితే అర్ష్ దీప్ ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అక్కడ అర్ష్ దీప్ ప్రదర్శన బలంగా ఉంది. అందువల్ల వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
Also Read : వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథుడి రథ చక్రాలొస్తున్నాయ్
Also Read : భారత్కు అమెరికా బంపర్ ఆఫర్.. హింట్ ఇచ్చిన ట్రంప్
bumrah | jasprit-bumrah | ind-vs-eng