BIG BREAKING: ఆర్సీబీ పై కేసు నమోదు.. వారిపై కూడా

ఆర్సీబీపై కేసు నమోదు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో RCB, DNA (ఈవెంట్ ఆర్గనైజేషన్), KSCA అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, మరికొందరిపై FIR నమోదు అయింది.

New Update
RCB

RCB

బుధవారం జరిగిన తొక్కిసలాట తర్వాత బెంగళూరు పోలీసులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) అడ్మినిస్ట్రేటివ్ కమిటీతో సహా మరికొందరిపై FIR దాఖలు అయింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో తొక్కిసలాట ఘటనలో నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. సెక్షన్ 105, సెక్షన్ 125(12), సెక్షన్ 142, సెక్షన్ 121, సెక్షన్ 190 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై స్థితి నివేదికను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించిన కోర్టు.. రాష్ట్రానికి నోటీసు జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

అనంతరం జూన్ 10 నాటికి వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి. కామేశ్వర్ రావు, న్యాయమూర్తి సి.ఎం. జోషి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. 

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

Advertisment
Advertisment
తాజా కథనాలు