/rtv/media/media_files/2025/06/02/RYbUx1aM5x4g0FWFjUWC.jpg)
Virat Kohli One8 Commune Pub
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ తగిలింది. అతడి స్వంత రెస్టారెంట్పై కేసు నమోదు అయింది. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో ఉన్న వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లో ధూమపానం చేసేందుకు ప్రత్యేక ఏరియా లేదనే కారణంతో కేసు ఫైల్ చేశారు. పూర్తి వివరాల్లో వెళితే..
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
Virat Kohli One8 Commune Pub
బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ ఉంది. అందులో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో అధికారులు ఒక విషయాన్ని గుర్తించారు. పబ్లో ధుమపానం చేసే వారి కోసం ప్రత్యేకంగా ఒక ఏరియా (సపరేట్ స్మోకింగ్ స్థలం) లేదని గుర్తించారు.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
దీంతో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) నిబంధనలకు ఇది విరుద్ధమని తెలిపారు. అనంతరం సదరు పబ్ మేనేజర్తో పాటు ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు. COTPA చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 21 కింద వారిపై కేసు ఫైల్ చేశారు. ఈ మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ ఎస్సై అశ్విని మీడియాతో మాట్లాడారు. చట్టప్రకారం.. అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనతో విరాట్ కోహ్లీ పబ్ వార్తల్లో నిలిచింది.