/rtv/media/media_files/2025/05/07/Arr1IA61ENdeI3MUfojk.jpg)
ipl 2025 bcci fines hardik pandya rs 24 lakh for slow over rate ashish nehra penalized
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. మంగళవారం (మే6) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారీ జరిమానాకు గురయ్యాడు. ఈ ఏడాది 2025లో ఐపీఎల్లో రెండో సారి స్లో ఓవర్ రేట్కు గురికావడంతో పాండ్యకు రూ.24 లక్షల ఫైన్ పడింది. దీంతో ఈ సీజన్లో రెండో సారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్న సెకండ్ కెప్టెన్గా పాండ్యా నిలిచాడు.
Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
పాండ్యకు ఫైన్
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ ఛేజింగ్ చేస్తున్నపుడు పాండ్యా తన టీమ్లో ఫీల్డింగ్ మార్పులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్తో పాటు ముంబై జట్టులోని మిగిలిన ప్లేయర్లకు కూడా జరిమానా వేశారు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
— Sportskeeda (@Sportskeeda) May 7, 2025
MI skipper Hardik Pandya has been fined INR 24 lakhs for maintaining a slow over rate vs GT. Additionally, all MI playing XI and impact players have also been fined 25% of their match fees 🤯❌
GT head coach Ashish Nehra has also been fined 25% of his… pic.twitter.com/Mvfmfsz9HR
Also Read: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
ఆఖరికి ఇంపాక్ట్ ప్లేయర్లను కూడా వదిలిపెట్టలేదు. వీరందరికీ టోర్నమెంట్ నియమావళి ప్రకారం.. ఒక్కొక్కరికి 6లక్షలు రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేయబడుతుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ స్లో ఓవర్ రేట్ కారణంగా పలు జట్ల కెప్టెన్లు శిక్ష అనుభవించారు. అందులో
Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
హార్థిక్ పాండ్య (ముంబై ఇండియన్స్)
శుభ్మన్ గిల్ (గుజరాత్)
అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్)
సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్)
రజత్ పాటిదార్ ( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్ )
రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్) ఉన్నారు.
Also Read: భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
మరోవైపు హార్థిక్ పాండ్యతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా ఫైన్ పడింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడికి ఈ ఫైన్ పడింది. దీంతో పాటు నెహ్రాకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.
hardhik-pandya | pandya | latest-telugu-news | GT vs MI