Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

New Update
Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే

Family Murders : ఈ మధ్య కాలంలో కుటుంబ హత్యలు చాలా జరుగుతున్నాయి. భార్య-భర్తలు(Wife-Husband), తండ్రి-కొడుకు(Father-Son), తల్లి-కొడుకులు(Mother-Son) ఇలా ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలో నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఏపీ(Andhra Pradesh) లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లిని సొంత కొడుకే కత్తితో విచక్షణారహితంగా హత్య చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మాగంటి ఉమమహేశ్వరి ఆమె కొడుకు మాగంటి సురేష్‌ గ్రామంలో ఉంటున్నారు. అయితే సురేష్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

Also Read : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

తల్లి ఉమమహేశ్వరి కొడుకుని మందలించేది. దీంతో ఇరువురి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆస్తి తనకు పంచివ్వాలంటూ కొడుకు సురేష్ తల్లితో వాదించాడు. కానీ ఇందుకు అతడి తల్లి ఒప్పుకోలేదు. చివరికి కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారించిన న్యాయస్థానం కొడుకుకు నోటీసులు పంపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్.. తల్లిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read : సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థులు.. సస్పెండ్!

Advertisment
తాజా కథనాలు