తెలంగాణలో ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ సమరానికి సై అంటూ దూసుకుపోతున్న వేళ.. కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. ఓవైపు ఎమ్మెల్యే టికెట్ల కోసం హస్తం పార్టీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా రేవంత్ రెడ్డి సైతం తాను కొడంగల్ నుంచి మాత్రమే దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ కొడంగల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ బెదిరింపులకు తమ నాయకులెవరు బెదరబోరన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తనను కొడంగల్ నుంచి పోటీ చేయాలని కోరారని.. తనను గెలిపించుకునే బాధ్యత నియోజకవర్గ ప్రజలదేనంటూ హామీ ఇచ్చారని రేవంత్ (Revanth) తెలిపారు. దీంతో కేవలం కొడంగల్ నుంచే తాను దరఖాస్తు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రేవంత్ మల్కజ్గిరి లేదా హైదరాబాద్ సిటీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. కాని అనూహ్యాంగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ నుంచే పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. కొడంగల్ను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్.. నియోజకవర్గ ప్రజలను మోసం చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. హైదారాబాద్- బీజాపూర్ హైవే తీసుకొచ్చింది తానేనన్నారు. కొడంగల్లో జరిగిన ప్రతి అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందన్నారు. నియోజకవర్గానికి తాగునీరు తెచ్చి ప్రజల దాహర్తి తీర్చింది తానే అని, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలను తీసుకొచ్చింది నేనేనంటూ రేవంత్ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్వి కేవతం మాటలు మాత్రమేనని, నియోజకవర్గానికి తండ్రి,కొడుకులు చేసిందేమి లేదన్నారు.
పూర్తిగా చదవండి..Congress: కొడంగల్ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్ రెడ్డి సవాల్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ నుంచే తాను ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న రేవంత్.. నియోజకవర్గం అభివృద్ధే తన తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ బెదిరింపులకు తమ కార్యకర్తలు ఎవరూ బెదరబోరన్నారు.
Translate this News: