రెండు రోజుల నుంచీ దర్శకధీరుడు రాజమౌళి ఓ పెద్ద న్యూస్ చెబుతారని వార్తలు వినిపించాయి. దానికి ఇవాళ తెర దించుతూ రాజమౌళి తన కొత్త సినిమా గురించి ట్వీట్ చేవారు. అయితే దీనిని ఆయన దర్శకత్వం చేయడం లేదు. జక్కన సమర్పణలో ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నారు. దాని గురించే రాజమౌళి ట్వీట్ చేసారు. భారతీయ సినిమా రంగం మీద మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాను నితిన్ కక్కర్ తెరకెక్కిస్తున్నారు. దీనిని ఎస్ఎస్ కార్తికేయ, వరుణ గుప్తాలు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్నే తెలుపుతూ రాజమౌళి ట్వీట్ చేవారు.
అసలు ఇండియన్ సినిమా ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కధాంశంతో మేడ్ ఇన్ ఇండియా తెరకెక్కుతోందని రాజమౌళి చెప్పారు. ఈ కథ విన్న వెంటనే తాను బావెద్వేగానికి గురయ్యానని…తనకు ఇలాంటి బయోపిక్ లను రూపొందించడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇంత మంచి సినిమాను సమర్పించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. నితిన్ కక్కర్ టీమ్ చాలా పెద్ద సినిమాను తీస్తున్నారని….చాలా పెద్ద సవాల్ అని అన్నారు. అయితే మూవీ టీమ్ ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మెడ్ ఇన్ ఇండియా ఆరు బాషల్లో రిలీజ్ అవనుంది. భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదల ఇందులో చూపించబోతున్నారు.
When I first heard the narration, it moved me emotionally like nothing else.
Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:)
With immense pride,
Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ— rajamouli ss (@ssrajamouli) September 19, 2023