Telangana : వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర(Vikasit Bharat Sankalp Yatra) లో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) దేశంలో పలువురిలోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందులో గవర్నమెంట్ ద్వారా లబ్ది పొందుతున్న వారితో ప్రధాని సంభాషించారు. అలా మాట్లాడిన వారిలో మన తెలంగాణ(Telangana) కు చెందిన మల్లిఖార్జున్ కూడా ఉన్నారు. కరీంనగర్ చొప్పదండి మండలం పెద్ద కూర్మపల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో ముచ్చటించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగంలో వారు చేస్తున్న కృషిని కొనియాడారు ప్రధాని మోడీ. మల్లికార్జున్ రెడ్డికి తోడుగా నిలిచి, అతని ఆశయాలకు తోడ్పాటు ఇస్తున్నందుకు అతని భార్యను కూడా ప్రత్యేకంగా పిలిచి మరీ పొగిడారు మోడీ.
పూర్తిగా చదవండి..PM Modi : యువతకు మీరు ఆదర్శం.. తెలంగాణ రైతుకు ప్రధాని మోడీ ప్రశంసలు
ఉన్నత చదువు ఉండి పల్లెకు వచ్చి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ రైతు మల్లికార్జున్ రెడ్డిన ప్రధాని మోడీ అభినందనలతో ముంచెత్తారు. మల్లిఖార్జున్ చేస్తున్నది చాలా గొప్ప పని అని కొనియాడారు. ఇలాంటి వారు దేశ యువతకు ఆదర్శమని చెప్పారు మోడీ.
Translate this News: