ప్లీజ్ రిషబ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. పాయల్‌ ట్విట్ వైరల్

బోల్డ్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ 'కాంతార' ప్రీక్వెల్ లో తనకు నటించాలనుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. నాకూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆశగా ఉంది. ఆడిషన్‌ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పాలంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను కోరింది.

New Update
ప్లీజ్ రిషబ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. పాయల్‌ ట్విట్ వైరల్

Mangalavaaram : స్టార్ నటి పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajput) ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పోస్ట్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇటీవలే 'మంగళవారం'(Mangalavaaram) సినిమాతో మాస్ ఆడియన్స్ ను మరోసారి అలరించిన బ్యూటీ ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే తన చేతిలో ఇప్పటికే మూడు సినిమాలుండగా మరో స్టార్ హీరోతో పనిచేసేందుకు తెగ ఆరాటపడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇటీవల కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతారా'ను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది పాయల్. భారతీయ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రం ప్రీక్వెల్ ‘కాంతారా: ది లెజెండ్‌’ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో తనకు అవకాశం ఇవ్వాలని దర్శకనిర్మాతలను కోరింది.

ఈ మేరకు హీరో రిషబ్‌శెట్టి, చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌ను ఉద్దేశిస్తూ.. 'రిషభ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌.. ‘కాంతారా: చాప్టర్‌-1’ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది. నాకూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆశగా ఉంది. ఇటీవల విడుదలైన నా చిత్రం ‘మంగళవారం’లో నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మీరు కాస్త సమయం వెచ్చించి నేను నటించిన సినిమా చూస్తే, మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్‌ చేస్తూ సహకరించే అభిమానులకు నా ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా పాయల్‌ రాజ్‌పుత్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తున్న ఫ్యాన్స్.. 'ఆమెను తీసుకోండి. ఆమె బాగా నటిస్తోంది. మంగళవారంలో శైలులాంటి పాత్ర పాయల్‌ మాత్రమే చేయగలదు. ఆమె ట్వీట్‌కు రిప్లై ఇవ్వగలరు’ అంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు.

publive-image

Also read :IAS Smitha Sabrwal:ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్

ఇదిలావుంటే.. ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ‘గోల్‌మాల్‌’, ‘ఏంజెల్‌’, ‘కిరాతక’ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. మరోవైపు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘మంగళవారం’ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ దక్కించుకున్నట్లు సమాచారం. డిసెంబరు చివరి వారంలో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు