Kishan Reddy About Lok Sabha Elections: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ (Telangana BJP) అన్ని స్థానాల్లో విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకే ఈ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్తోనే తమ పోటీ అని.. బీఆర్ఎస్తో కాదని అన్నారు. త్వరలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
Translate this News: