'పాకిస్థాన్‌కి వెళ్తే చంపేస్తారు, మేమిక్కడే ఉంటాం'.. పాక్ కుటుంబాల ఆవేదన

పాకిస్థానీయులు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు పాకిస్థానీయులు భారత్‌ విడిచి వెళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌కు తిరిగి పంపించొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నారు.

author-image
By B Aravind
New Update
We Wont Return to Pakistan,  pakistan National Requests Central Govt

We Wont Return to Pakistan, pakistan National Requests Central Govt

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం దాడి తర్వాత భారత్‌లో హై అలెర్ట్ నెలకొంది.  దేశంలో ఉంటున్న పాకిస్థానీయులను వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు పాకిస్థానీయులు భారత్‌ విడిచి వెళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని చంపాలనుకుంటే ఇక్కడే చంపేయండి.. పాకిస్థాన్‌కు మాత్రం తిరిగి పంపించొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నారు.  పాకిస్థాన్‌లో తమ భూములు, ఇళ్లు, పొలాలు అతి తక్కువ ధరకు అమ్మేసి.. ప్రశాంతమైన జీవితం కోసం భారత్‌లో స్థిరపడ్డామని చెబుతున్నారు. తమను పాకిస్థాన్‌కు తిరిగి పంపించొద్దని ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు. 

Also Read: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

ఇదిలాఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: 1000 మంది అక్రమ వలసదారులు గుర్తింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

Also Read: పారిశుద్ధ్య కార్మికుల మీదకి దూసుకెళ్లిన వ్యాన్.. ఆరుగురు మృతి

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Jammu and Kashmir | telugu-news | Pahalgam attack | national-news

Advertisment
Advertisment
తాజా కథనాలు