/rtv/media/media_files/2025/01/27/NlV5FDmli5K3qb9lAM4L.jpg)
Waqf Board, JPC
పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) వక్ఫ్ సవరణ బిల్లుకు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జేపీపీ పలు ప్రతిపాదనలతో ఈ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను కమిటీ ఆమోదించగా.. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తిమంతగా చేస్తాయని ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ అన్నారు.
Also Read: ఇవ్వాల్టితో ఉత్తరాఖండ్లో మారనున్న రూల్స్ ఇవే.. పెళ్లికి రిజిస్ట్రేషన్ ఇంకా..
ఇదిలాఉండగా.. వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జేపీసీకి బీజేపీ ఎంపీ జగదాంబి పాల్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే సోమవారం జేపీసీ సమావేశమైంది. విపక్ష ఎంపీలతో పాటు ఇతరులు ఈ బిల్లులో 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించిందని జగదాంబిక పాల్ వెల్లడించారు. అయితే ఈ 14 ప్రతిపాదన ఆమోదానికి సంబంధించి జనవరి 29 వరకు ఓటింగ్ జరుగుతుంది. జనవరి 31న తుది నివేదికను లోక్సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన అమిత్ షా.. వీడియో ఇదిగో
జనవరి 24న జరిగిన ప్యానెల్ సమావేశం రసాభాసగా జరిగింది. ఛైర్మన్ జగదంబికా పాల్ ప్రొసిడింగ్స్ ద్వారా తమపై ఒత్తిడి చేస్తూ ఇష్టారీతాగా అజెండా మారుస్తున్నారని విపక్ష సభ్యులు నిరసన తెలియజేశారు. దీంతో 10 విపక్ష సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపించగా.. వీటిని జగంబికా పాల్ ఖండించారు. సమావేశాన్ని అడ్డుకునేందుకే సభ్యులు ఇలా వ్యవహరిస్తున్నారని తెలిపారు.