/rtv/media/media_files/2025/03/15/c4MjNyWqfmt7cWl1elP9.jpg)
love attack Photograph: (love attack)
EX Lover Attack: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో వాడుకోవడమే కాకుండా తనకు ఇచ్చిన నగదు, నగలు తిరిగి ఇవ్వమన్నాడనే కోపంతో ఓ యువతి దారుణానికి పాల్పడింది. నాలుగేళ్లుగా ప్రేమను మరిచిపోయి పగతో రగిలిపోయిన లేడీ మాజీ ప్రియుడిని చావు అంచుల దాకా తీసుకెళ్లింది. స్నేహితులతో దాడి చేయించి, బలవంతంగా పాయిజన్ తాగించి చిత్రహింసలకు గురిచేసింది. ఈ భయంకరమైన ఘటన యూపీ హరీమ్పూర్ చోటుచేసుకోగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సొమ్ము తిరిగి ఇవ్వమంటావా..
ఈ మేరకు హరీమ్పూర్కు చెందిన ఓ యువకుడు మహోబాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్గా జాబ్ చేస్తు్న్నాడు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం కాళీ పహాడీ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ సహజీవనం చేస్తుండగా కొన్నాళ్లకు మనస్పర్థలతో విడిపోయారు. అయితే కలిసివున్నపుడు ఆ యువతికి అతను నగలు, డబ్బు ఇచ్చాడు. ఇటీవల విడిపోవడంతో తన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె తన స్నేహితులతో కొట్టించి బలవంతంగా విషం తాగించింది. పోలీసులకు అతని స్నేహితులు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. ఆమెకు రూ.4 లక్షల నగదు ఇచ్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మహిళా ఎస్సైపై ఒక కానిస్టేబుల్ అత్యాచారినికి పాల్పడ్డాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. కొద్ది రోజులు ఓపిక పట్టిన బాధితురాలు మహిళా ఎస్సై తాజాగా పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ అస్లాంపై పలు తీవ్రమైన అభియోగల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!