/rtv/media/media_files/2025/03/04/5aNVnW9tFAtw7rZ3hRbj.jpg)
Uttar Pradesh Speaker Slams MLA For Spitting 'Pan Masala' In Assembly
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ మంగళవారం ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సభ హాల్లో ఓ ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి ఉమ్మివేయడం దుమారం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా సిబ్బందితో కలిసి సభ హాల్ను శుభ్రం చేశారు. ఆ తర్వాత సెషన్ ప్రారంభమైన వెంటనే ఆయన మాట్లాడుతూ సభా ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరారు.
Also Read: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్
'' విధాన సభ హాల్లో ఉదయం జరిగిన సంఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకరు పాస్ మసాలి నమిలి అక్కడ ఉమ్మేశారు. విషయం తెలియగానే నేను స్వయంగా వెళ్లి శుభ్రం చేశాను. అక్కడ ఉమ్మేసిన ఎమ్మెల్యే ఎవరో అనేది నేను వీడియోలో చూశాను. ఆయన పేరు చెప్పి పరువు తీయాలని అనుకోవడం లేదు.
Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
తనంతటా తాను నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకోవాలి. లేకుంటే నేనే పిలవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనుంచి ఎవరైనా అలా చేయడం మీరు గమనిస్తే వెంటనే వాళ్లని అడ్డుకోండి. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని'' స్పీకర్ సతీష్ మహానా అన్నారు. అయితే సభా హాల్లో ఎమ్మెల్యే ఉమ్మేసిన చోటుకి స్పీకర్ వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభలో ఇలా చేయడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
యూపీ అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యేలు..
— RTV (@RTVnewsnetwork) March 4, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో! #UPAssembly #UttarPradesh #viralvideo #RTV pic.twitter.com/5SOo8sfWrR
Also Read: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!