Viral Video: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..

పెళ్లయిన నెల రోజులకే భర్తతో కాపురం ఇష్టం లేదంటూ యువతి ఫస్ట్ నైట్ రోజు తన ప్రియుడితో వీడియో కాల్ చేసి మాట్లాడింది. షాక్ అయిన భర్త ఆమెను పుటింటికి పంపాడు. పెద్దల ఒప్పదం ప్రకారం వచ్చిన ఆ మహిళ ఏకంగా భర్తకు జ్యూస్‌లో పాయిజన్ కలిపి ఇచ్చేసింది.

New Update
Poison experiment on husband

Poison experiment on husband

Viral Video: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాకు చెందిన సుందరమూర్తికి కలైయరసన్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి జనవరి 26న కుటుంబ పెద్దలు ఆర్తి అనే యువతితో వివాహం చేశారు. అయితే ఆర్తికి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. తల్లిదండ్రులు పట్టుబట్టడం వల్లే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లికి ఒప్పుకుంది. కాగా.. ఆర్తి పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించినట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ నైట్ రోజు ఆమె భర్త ముందే తన ప్రియుడితో వీడియో కాల్ చేసి మాట్లడింది. దీంతో భర్త కలైయరసన్ షాక్ అయ్యాడు. 

భర్తకు విష మిచ్చి..

ఇదే విషయంపై భర్త నిలదీయడంతో వేరే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. ఐతే..పెద్దమనుషుల పంచాయితీలో రాజీ కుదిరింది.. కానీ పంచాయితీ తర్వాత కూడా ఆమె ప్రేమాయణం కొనసాగించింది. ఆ విషయం అమ్మమామలకు చెప్పి వారి ఇంటికి పంపారు. కుమార్తెను మందలించిన కుటుంబ సభ్యులు ఆమె నచ్చచెప్పి  పంపారు. పుట్టింటివారు సర్దిచెప్పినా అత్తారింటికి వచ్చి ఆర్తి మనస్సు మార్చుకోలేదు. అయితే తన ప్రేమికుడితో ఎడబాటును తట్టుకోలేక ఎలాగైన భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. 

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?

ఫిబ్రవరి 20వ తేదీన గురువారం  రోజు సాఫ్ట్ డ్రింక్‌లో విషం కలిపి.. భర్త కలైయరసన్‌కు ఇచ్చింది. భార్య విషం కలిపిన విషయం తెలియక అతడు దానిని తాగి చావుబ్రతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కలైయరసన్‌ కుటుంబ సభ్యులు కడలూరులోని పుదుచత్తారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్తిపై తగిన చర్యలు తీసుకోవాలని కలైయరసన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆర్తిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో కేసు నమోదైంది.

ఇది కూడా చదవండి: అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్లైఓవర్ కింద ఎగసిపడుతున్న మంటలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు