/rtv/media/media_files/2025/06/15/R2oLUZA47F2o2cR5jE7T.jpg)
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి టర్కీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787- 8 విమానం నిర్వహణ టర్కీ దేశానికి చెందిన సంస్థ చూసిందని వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. ఎయిర్ ఇండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.
Turkish Technic currently carries out heavy maintenance on aircraft from Air India Boeing 777 and 787 types. It operates 64 widebodies among its fleet of 191 aircraft.#AirIndia Aviation crash is more likely a sabotage by Turkish MRO which is owned by Erdogan's daughter. Turkey… pic.twitter.com/5BJBUH7pkK
— Amit Trade 🌟🚨 (@aammiitt2) June 15, 2025
బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ఈ రకం విమానానికి నిర్వహణ చేయలేదని టర్కీ తెలిపింది. విమాన ప్రమాదంలో టర్కీ ప్రస్తవన రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధవాతావరణ నెలకొంది. ఆ సమయంలో టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసింది.