/rtv/media/media_files/2025/08/04/trump-2025-08-04-21-36-24.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో సమావేశమైన తర్వాత ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
#BREAKING: US President Donald Trump in a new Truth Social post claims US has lost India and Russia to “deepest darkest, China”. “May they have a long and prosperous future together”, he says. pic.twitter.com/SeuW9dSzBl
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 5, 2025
తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఒక పోస్ట్ చేస్తూ, "భారత్, రష్యా రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు' అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, "వారందరికీ సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ, పుతిన్, జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.