/rtv/media/media_files/2025/03/19/JELmx4qdRN33hxhcJG04.jpg)
Ration Cards
Ration Cards: తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటినుంచి రేషన్కార్డుల ఏరివేతపై కసరత్తు సాగుతూనే ఉంది. లబ్ధిదారుల్లో అనర్హులున్నారన్న నేపంతో పలువురి రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గడచిన 6 నెలలుగా ఎవరైతే రేషన్ తీసుకోలేదో వారి వివరాలను అధికారలు సేకరిస్తున్నారు. వారి పరిశీలన ప్రకారం లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులున్నారని లెక్క తేల్చింది. వారి వివరాలను జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్లకు పౌర సరఫరాలశాఖ పంపించింది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
ఇక రేషన్ కార్డు దారుల్లో ఎవరైతే అనర్హులుగా తేలారో వారిని కొద్ది రోజుల్లోనే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. అనర్హులుగా తేలిన వారికి ఇక మీదట రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాలశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. రేషన్ కార్డుల మీదా లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు. అలా రేషన్ తీసుకోకుండా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకోనివారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా కేంద్రం గుర్తించింది. వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చేరిన వివరాలను పౌర సరఫరాలశాఖ జిల్లాల వారిగా విభజించి ఆ వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించింది. వాటిపై రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం విచారణ చేయించింది. ఇందులో అర్హులు, అనర్హులను గుర్తించింది. ఆ వివరాల్ని పౌరసరఫరాలశాఖకు పంపించగా, వారిలో అనర్హులను రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్ల
కాగా మొత్తం లబ్ధిదారులుగా 1,62,773 మందిని గుర్తించారు. వారిలో 96,240 కార్డులు అనుమానస్పద కార్డులుగా తేలింది. వీటిలో 76,842 మంది అనర్హులుగా తేల్చారు. కాగా అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60 శాతం మంది అనర్హులేనని కేంద్రం తేల్చింది. ఇక అనర్హులుగా గుర్తించిన వారిలో చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, చనిపోయినవారు, రెండుచోట్ల రేషన్ కార్డుల్లో పేర్లున్నవారు ఉన్నట్లు తేలింది. వీరందరి పేర్లను త్వరలో తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అనర్హులు జాబితాలో ఉన్న వారిలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!