Plane Crash : భూమి మీద నూకలున్నాయి బ్రో...

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సిన ఒక ప్రయాణీకుడు చివరినిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బతికి పోయాడు. ఈ విషయం తెలిసి ఆయనకు భూమి మీదా ఇంకా నూకలు మిగిలే ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు.

New Update
Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash


Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సిన ఒక ప్రయాణీకుడు చివరినిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బతికి పోయాడు. ఈ విషయం తెలిసి ఆయనకు భూమి మీదా ఇంకా నూకలు మిగిలే ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు.

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానంలో వెళ్లా్ల్సిన సావ్జీ భాయ్ టింబాడియా తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బతికిపోయాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తన కుమారుడు బ్రిటన్ రాజధాని లండన్‌లో నివసిస్తున్నాడు. తనను కలిసేందుకు నేను లండన్‌ వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ రోజు నాకు వెళ్లాలనిపించలేదు, కాబట్టి నేను వెళ్లలేదు. సోమవారం కోసం తదుపరి టికెట్ బుక్ చేసుకున్నాను అని తెలిపాడు. 

ఇంకా మాట్లాడుతూ "నేను మూడు-నాలుగు రోజుల తర్వాత వెళ్ళాల్సి ఉంది. సోమవారం టికెట్ బుక్ చేసుకున్నాను. ఈరోజు విమానంలో కూడా నాకు టికెట్ ఉంది. కానీ నేను వెళ్లలేదు. విమానం కూలిపోయిందని నాకు తెలిసింది. నేను స్వామి నారాయణ్ భక్తుడిని , నేను రోజూ గుడికి వెళ్తాను. నేను ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్తాను. స్వామి నారాయణ్ నన్ను కాపాడాడు అని ఉద్వేగానికి గురయ్యాడు. నేను ఒంటరిగా లండన్ వెళ్తున్నానని ఆయన అన్నారు. నిజానికి నేను ఈ రోజే వెళ్లాల్సి ఉండే. ఈరోజు నాకు వెళ్లాలని అనిపించలేదు. ఈరోజు నేను వెళ్లాల్సిన అవసరం లేదని నాకు ఎక్కడినుంచో ఒక స్వరం వినిపించింది. ఈరోజు నేను వెళ్లకూడదని నాకు సహజంగానే అనిపించింది. ఈరోజు మంచి రోజు కాదని నాకు అనిపించింది అని ఆయన చెప్పుకొచ్చారు. టింబాడియా తన సీటు నంబర్ A1 అని చెప్పాడు.
 Also Read: బిగ్‌ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం

ఈ రోజు మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 7 మంది పోర్చుగీస్,1 కెనడియన్ పౌరుడు ఉన్నారని ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు . ఈ ప్రమాదం మాటల్లో చెప్పలేనిదని ఆయన ట్వీట్‌ చేశారు. నేను స్వయంగా మంత్రులు, అధికారులతో టచ్‌లో ఉన్నాను. ప్రమాదంలో బాధితులైన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు