OPERATION SINDOOR : పహెల్గాం ఉగ్రదాడి తర్వాత తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై విరుచుకుపడింది. పాక్లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా ఈ తెల్లవారు జామున ప్రతీకార దాడులు చేసింది. దీంతో భారత్ – పాకిస్థాన్దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో పాకిస్థాన్ మరోసారి ప్రతీకార దాడులకు తెగబడుతోందన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ఐపీఎల్ పై ఉండబోదని బీసీసీఐ భావిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దాంతో ఐపీఎల్ ఆగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అదేం ఉండదని నిర్వహకులు అంటున్నారు.
ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వర్గాలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాయి. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలవల్ల ఐపీఎల్ 2025 సీజన్కు ఎలాంటి ఆటంకం ఉండబోదని, ఎప్పటిలాగే యథావిధిగా సీజన్ కొనసాగుతుందని తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఇవాళ పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది.