/rtv/media/media_files/2025/04/25/cVPIAyzIqxwi6XuxhKXA.jpg)
tamil nadu teacher fines 2 lakh rupees
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ లేడీ టీచర్ అమానవీయ చర్యకు పాల్పడింది. విద్యార్థిని హోం వర్క్ చేయలేదని.. దారుణమైన శిక్ష విధించింది. మొత్తం 600 గుంజీలు విద్యార్థినితో తియ్యించింది. దీంతో ఈ విషయం మానవ హక్కుల కమిషన్ వద్దకు చేరడంతో.. లేడీ టీచర్కు భారీ జరీమానా విధించింది. దాదాపు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
600 గుంజీలు
ఈ ఘటన తమిళనాడులో జరిగింది. శివగంగై జిల్లా తిరుమానగర్కి చెందిన పాండిసెల్వి కూతురు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఆమె హోం వర్క్ చేయలేదని లేడీ టీచర్ చిత్ర ఊహించని శిక్ష విధించింది. మొదటి రోజు 200 గుంజీలు తీయించింది. అక్కడితో ఆగకుండా మరుసటి రోజు మరో 400 గుంజీలు తీయించింది.
దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ బాలికను తోటి స్నేహితులు సైకిల్పై ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఆ బాలిక అనారోగ్యం బారిన పడింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అనంతరం లేడీ టీచర్ పై స్టూడెంట్ తల్లిదండ్రులు చెన్నైలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె చర్య వల్లనే తన కుమార్తె ఆరోగ్యపరంగా, మానసికంగా దెబ్బతిందని.. అందువల్ల టీచర్ చిత్రపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఆ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కమిషన్ పలు మార్లు ఆ టీచర్కు నోటీసులు పంపించింది. కానీ ఆ టీచర్ స్పందించకపోవడంతో విచారణ జరిపిన కమిషన్ భారీ జరిమాన విధించింది. పిటిషనర్ పాండిసెల్వి కూతురికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం అందజేయాలని తెలిపింది. అయితే ఆ నగదును లేడీ టీచర్ నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
crime news | viral-news | latest-telugu-news | telugu-news