Odisha:  1.5 టన్నుల పేలుడు పదార్ధాలను దొంగిలించిన నక్సల్స్..హై అలెర్ట్ లో పోలీసులు

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో 1.5 టన్నుల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ట్రక్కును నక్సల్స్ బృందం దోచుకుంది. దీంతో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

author-image
By Manogna alamuru
New Update
Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

ఒడిశాలోని నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సుందర్ ఘడ్ జిల్లాలో మంగళవారం 30 నుంచి 40 మంది నక్సల్స్ బృందం 1.5 టన్నుల పేలుడు పదార్ధాల ఉన్న ట్రక్కును దోచుకుంది. ఈ ఘటన తర్వాత ఒడిశా, జార్ఖండ్ పోలీసు దళాలు అప్రమత్తమయ్యాయి.  

ట్రక్కును దొంగలించి..అడవుల్లోకి..

బడాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇట్మా సమీపంలోని మందుగుండు సామగ్రి గిడ్డంగి నుండి లంగల్‌కట రాతి క్వారీకి పేలుడు పదార్థాలను ఓ ట్రక్కు రవాణా చేస్తోంది. దీనిని ఉదయం 9 గంటల ప్రాంతంలో కె బాలంగ్ పోలీస్ పరిధిలోని లంగల్‌కట ప్రాంతం సమీపంలో నక్సల్స్ అడ్డగించారు. ఆయుధాలతో ఉన్న వ్యక్తులు వాహనాన్ని ఆపి.. డ్రైవర్‌ను బందీగా చేసుకున్నారు తరువాత ట్రక్కును సరందా దట్టమైన అడవుల వైపు బలవంతంగా మళ్లించారు. అడవుల్లోకి వెళ్ళాక నక్సల్స్ డ్రైవర్ ను ఏమీ చేయకుండా విడిచిపెట్టారని పోలీసులు తెలిపారు. దీని తరువాత స్థానిక పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ట్రక్కును కనుగోనడానికి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఈ దొంగతనం జరగడంతో తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. 

Also Read: Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు