/rtv/media/media_files/2025/04/18/AGZD9Xknjo3rlmHstKt1.jpg)
ఆరు సార్లు వాయిదాలు పడిన తర్వాత బుధవారం శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి ప్రయాణించాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయ హ్యోమగామిగా శుభాన్షు శుక్లా ఘనత సాధించాడు. ఇటీవల క్రితం సునితా విలియమ్స్ ISSలో నెలలపాటు గడిపింది. ఆమె ప్రవాస భారతీయురాలు, అమెరికా పౌరురాలు. ఆక్సియమ్ మిషన్ 4 అని పిలువబడే ఈ మిషన్ NASA, ఆక్సియమ్ స్పేస్ మరియు స్పేస్ఎక్స్లతో ఉమ్మడి ప్రాజెక్ట్. ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఫాల్కన్ 9 రాకెట్పై ప్రయోగించిన తర్వాత, సిబ్బంది కొత్త స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో కక్ష్యలోని ప్రయోగశాలకు ప్రయాణిస్తున్నారు. 28 గంటలపాటు 400 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారు. వారు ప్రయాణించిన స్పేస్షిప్ జూన్ 26 గురువారం సాయంత్రం 4:30 గంటలకు ISSకు డాకింగ్ చేయనున్నారు. నాసా మాజీ వ్యోమగామి, ఆక్సియమ్ స్పేస్లో మానవ అంతరిక్ష ప్రయాణ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ ఈ వాణిజ్య మిషన్కు నాయకత్వం వహిస్తున్నారు.
శుభాన్షు శుక్లా పైలట్గా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు మిషన్ నిపుణులు చేరారు. పోలాండ్లోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుండి ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ, హంగేరీ HUNOR ప్రోగ్రామ్ నుండి వ్యోమగామి టిబోర్ కాపు.