Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

ఆక్సియమ్ స్పేస్ ప్రకారం, ఆక్సియమ్ మిషన్ 4 బృందం 580 పౌండ్లకు పైగా (సుమారు 263 కిలోగ్రాములు) వస్తువులను తిరిగి తీసుకువస్తున్నారు. వీటిలో ప్రధానంగా 60కి పైగా ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, పరిశోధనా నమూనాలు ఉన్నాయి.

New Update
Shubhanshu Shukla

ఆక్సియమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులపాటు విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా జూలై 14న భూమికి తిరిగి రానున్నారు. ఈ మిషన్ కేవలం శాస్త్రీయ ప్రయోగాలకే పరిమితం కాకుండా, భారత్ సంస్కృతి, వారసత్వాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు ఒక అద్భుత వేదికగా నిలిచింది. శుక్లా ISS నుంచి కొన్ని వస్తువులను తీసుకువస్తున్నారు. వాటి గురించి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ISS నుంచి శుభాంశు శుక్లా తీసుకువస్తున్నవి:

ఆక్సియమ్ స్పేస్ ప్రకారం, ఆక్సియమ్ మిషన్ 4 బృందం 580 పౌండ్లకు పైగా (సుమారు 263 కిలోగ్రాములు) వస్తువులను తిరిగి తీసుకువస్తున్నారు. వీటిలో ప్రధానంగా 60కి పైగా ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, పరిశోధనా నమూనాలు ఉన్నాయి. శుభాంశు శుక్లా స్వయంగా నిర్వహించిన భారతీయ ప్రయోగాల ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి అనేక అరుదైన, ముఖ్యమైన శాస్త్రీయ పదార్థాలతో తిరిగి వస్తున్నారని నాసా తెలియజేసింది. వీటిలో నాసా అంతరిక్ష హార్డ్‌వేర్, 60కి పైగా సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన డేటా ఉన్నాయి. ఈ ప్రయోగాలు అంతరిక్షంలో నిర్వహించబడ్డాయి. భవిష్యత్ అంతరిక్ష సాంకేతికత, వైద్య శాస్త్రానికి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.

తిరుగు ప్రయాణం వివరాలు:

భారతీయ కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు (IST) స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ISS నుంచి అన్‌డాక్ అయింది. శుక్లా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపులతో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నారు. సుమారు 22.5 గంటల ప్రయాణం తర్వాత, ఈ అంతరిక్ష నౌక జులై 15 మధ్యాహ్నం 3 గంటలకు (IST) అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ తిరుగు ప్రయాణం పూర్తిగా ఆటోమేటెడ్‌గా జరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు