Viral Video: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

తమిళనాడు పాలక్కోడులోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గిరిజన విద్యార్థినులతో టాయిలెట్లను కడిగించడం వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది.

New Update
toilets cleaning

toilets cleaning Photograph: (toilets cleaning )

తమిళనాడు (Tamilnadu) లోని పాలక్కోడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌ (Viral Video) గా మారడంతో ప్రిన్సిపాల్ సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా విద్యాశాఖాధికారి సత్వరమే స్పందించి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ విచారణ చేపట్టారు. యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులు చీపుర్లు పట్టుకుని క్యాంపస్‌లో టాయిలెట్లను శుభ్రం చేస్తున్నట్టు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read :  ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

తమ పిల్లలు తరచుగా స్కూల్ లో క్లీనింగ్ పనులతో అలసిపోయి ఇంటికి తిరిగి వస్తున్నారని పేర్కొంటూ తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ పనులలో మరుగుదొడ్ల నిర్వహణ, నీళ్లు తీసుకురావండం, పాఠశాల ఆవరణను చక్కబెట్టడం వంటివి ఉన్నాయి. ఈ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 150 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు.

Also read :  కలెక్టరేట్‌ రసాభాస ఘటన..కౌశిక్‌ రెడ్డి పై మూడు కేసులు నమోదు!

ఇంటికి రాగానే హోం వర్క్ చేయలేక పిల్లలు అలసిపోతున్నారని..  ఎందుకని అడిగితే చదువు చెప్పకుండా ప్రిన్సిపాల్  స్కూల్, టాయిలెట్స్ శుభ్రం చేయిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారని వెల్లడించారు.  దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌ను గట్టిగానే నిలదీశారు. తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తుంది చదువుకోడానికి కానీ..  ఇలా శుభ్రం చేయడానికి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు వారితో చేయిస్తే  వారి ఆరోగ్యం దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  

Also Read :  నిరంతర కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే?

స్కూల్ లోనే ఆందోళనలు

వెంటనే  ప్రిన్సిపాల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల స్కూల్ లోనే ఆందోళనలకు దిగారు.  వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి జ్యోతిచంద్ర  ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపుతామని  హామీ ఇచ్చారు.. విద్యార్థుల హక్కులు, శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ విచారణ చేపడతామని తెలిపారు.  గతంలో కూడా ఇలాంటి ఘటనలు దేశంలో చాలానే చోటుచేసుకున్నాయి.  అయినప్పటికీ ఉపాధ్యాయులలో ఎలాంటి మార్పు రావడం లేదు.  

Also Read : అదిరింది కదూ .. ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో విందు

Advertisment
Advertisment
తాజా కథనాలు